శ్రీ గొల్లపూడి మారుతీ రావు
గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి సుపరిచితులు.నటులే కాకుండా మంచి రచయిత , నాటక
కర్త, రేడియో వక్త, టీవీ యాంకర్, కాలమిస్టు.
అభిలాష, సంసారం ఒక చదరంగం, ఇంట్లో రామయ్య
వీధిలో క్రిష్నయ్య , వంటి సినిమాలలో ఆయన నటన బాగుంటుంది.సినిమాల కంటే ముందుగా ఆయన
నాటక రచయిత.తరువాత స్క్రీన్ ప్లే రచయిత. చాలా సినిమాలకి కధ , మాటలు కూడా అంది౦చారు.యద్దనపూడి
సులోచన రాణి గారితో కలిసి ఆయన రాసిన “ఆత్మా గౌరవం” సినిమా స్క్రీన్ ప్లే చాల
బాగుంటుంది.
ఇదే కాకుండా మంచి నోవెల్స్
కూడా రాశారు. వాటిలో చెప్పుకోదగ్గవి “వెన్నెల కాటేసింది”, “సాయంకాలమైంది”, “ ఎర్ర
సీత” “మళ్ళీ రైలు తప్పిపోయింది”.
కధ, సంభాషణలు ఎక్కడినుంచో
కాకుండా పూర్తిగా మన జీవితాల్లోంచే రాయగలగడం ఆయన స్పెషాలిటీ.అంతే కాకుండా వారం
వారం ఆయన బ్లాగులో రాసే కాలం హైలెట్. దేశంలో జరిగే చాల విషయాల మీద
స్పందిస్తారు.అవి తప్పక చదవాల్సినవి.
ఇంతకు ముందు కూడా సాక్షి,
వార్త పేపర్స్ కి కాలమ్స్ రాసేవారు.ఈ వయస్సులో కూడా క్రమం తప్పకుండా ఆయన రాసే కాలమ్
ఎందఱో యువతీ యువకులకు ఒక స్ఫూర్తి.
అంతే కాకుండా ప్రతి
సంవత్సరం, ఆయన కొడుకు గొల్లపూడి శ్రీనివాస్ పేరు మీద ఒక కొత్త దర్శకుడుకి అవార్డ్
అందజేస్తారు. ఎందుకంటే ఆయన కొడుకు మొదటి సినిమా తీస్తూ మరణించారు. ఆ విషాదాన్ని ఈ రకంగా
ఆయన ఒక సంస్కారంగా మలచుకున్నారు. అది చాలా గొప్ప విషయం.
ఆయన రాసిన నవలల్లో కొన్ని
వ్యాక్యాలు మీకోసం:
చదువు నేర్పిన సంస్కారం,
చదువు రాని ఆడ పిల్ల మొండి దైర్యాన్ని చంప లేదు..
కొందరికి ఆకలి అవసరం,
కొందరికి వ్యసనం, కొందరికి కల. కొందరిని చూస్తే తినడానికే పుట్టినట్టుంటారు.కొందరు
పుట్టారు కనక తింటారు.
ఎదుటి వ్యక్తి బలహీనతని
స్త్రీ బలమూ చెయ్యగలదు, ఆ ఒక్క కారణంగా నాశనమూ చెయ్యగలధు.
ఆరోగ్యకరమైన ఆనందానికి చలవ
గదులూ , బ్యాంక్ అకౌంట్లు, బెంజి కారు, బఫెట్ డిన్నర్లు అవసరం లేదు.పూరి పాకలో
అలసిన శరీరంలో ఆరంగుళాల గుండెకాయలో చిన్న ప్రకంపన చాలు.
No comments:
Post a Comment